పల్నాడుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ

పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నియమించింది

Update: 2024-05-15 04:04 GMT

tdp, candidate, mlc of local bodies, visakha district

పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ అక్కడకు వెళ్లి టీడీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు.

ఏడుగురు సభ్యులతో...
కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బొండా ఉమామహేశ్వరరావు , కొల్లు రవీంద్ర, లావు శ్రీ కృష్ణదేవరాయులు, జంగా కృష్ణమూర్తి జూలకంటి బ్రహ్మా రెడ్డి ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కమిటీ నిజనిర్ధారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుందని తెలిపారు.


Tags:    

Similar News